వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణం భీమ రెడ్డి కాలనీలో భార్య సత్యమ్మ హత్య కేసులో భర్త గురుస్వామిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కుటుంబ సమస్యల కారణంగా ఈనెల 11న భార్య సత్యమ్మను భర్త రంగస్వామి గొంతు నలిమి చంపేశాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి గురు స్వామిని అరెస్టు చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు.
Comments
Loading comments...

