వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ వర్షానికి ఇల్లు కూలింది.. పరిహారం కోరుతున్న బాధితులు

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి గ్రామానికి చెందిన స్థానిక నివాసి పులుగు లక్ష్మయ్య ఇల్లు ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా కూలిపోయింది.
గోడలు, పైకప్పు కూలడంతో ఇంట్లోని సామగ్రి దెబ్బతినగా, కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం, తాత్కాలిక నివాసం కల్పించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...