వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి బస్టాండ్లో 15 అడుగుల బుంగ ఏర్పడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటన సమయంలో అక్కడ ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మూసివేసిన భూగర్భ గనుల ప్రభావమే ఇందుకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే ఆదేశాలతో సింగరేణి, మున్సిపల్ సిబ్బంది గొయ్యిని పూడ్చివేశారు. భూమి కుంగుదలపై పూర్తి స్థాయిలో పరిశీలించి శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

