వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ వేళకు అందడం లేదని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బచ్చోడు సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు రావాల్సిన విద్యుత్ గంటల తరబడి నిలిచిపోతోందని విమర్శించారు.
ఎల్నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

