వార్తలకు తిరిగి వెళ్లండి
నక్కపల్లిలో బీసీ గురుకుల పాఠశాల మంజూరు
హరిక శర్మ Jun 24, 2026 7:38 AM అనకాపల్లి 12 viewsabout 16 hours ago

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు స్పందించి, పాఠశాలను మంజూరు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు హోం మంత్రి అనిత కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పాఠశాల ద్వారా మత్స్యకార, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అనిత పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...