వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో రైతులకు, విద్యార్థులకు ప్రభుత్వం అందించే రుణాలు సకాలంలో అందేలా బ్యాంకులు చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తూ, ప్రాధాన్యత రంగాలకు రూ. 32,175 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా ఆర్థిక అభివృద్ధిలో భాగంగా బ్యాంకులు ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

