వార్తలకు తిరిగి వెళ్లండి

'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగం పాత్రపై ఉన్నతస్థాయి కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగం కోసం కమిటీ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల సదస్సులో మాట్లాడిన ఆమె బ్యాంకింగ్ సంస్కరణలపై బ్యాంకు అధిపతులు సూచనలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

