వార్తలకు తిరిగి వెళ్లండి

పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను బండి సాయిభగీరథ్ ఉపసంహరించుకొన్నారు.
ఈ కేసులో ఆయన ఇప్పటికే అరెస్టు అయినందున ముందస్తు బెయిల్ పిటిషన్కు అర్ధముండదని, అందుకే దీనిని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు విచారణ జాబితాలో ఈ పిటిషన్ ఉపసంహరణ కేటగిరీలో నమోదైంది.
Comments
Loading comments...

