వార్తలకు తిరిగి వెళ్లండి
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...