Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో పడిన కారు.. మహిళ మృతి

Follow Udayam on Google
madhu Aug 27, 2026 5:47 PM ములుగుGeneral
బావిలో పడిన కారు.. మహిళ మృతి - Udayam
భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. బొమ్మకల్కు చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధ, వీరారెడ్డి కలిసి పోతారం శుభం గార్డెన్స్లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తోట సమీపంలో రోడ్డుపక్కన ఉన్న బావిలో కారు పడటంతో రాధ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...