వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల సౌకర్యార్థం తానూర్ మండలంలోని బామ్ని గ్రామానికి బస్సు సర్వీసును పొడిగించినట్లు బైంసా డిపో మేనేజర్ హరిప్రసాద్ తెలిపారు. గతంలో మహాలింగి వరకే నడిచిన ఈ బస్సు, ఇకపై బామ్ని వరకు వెళ్తుందన్నారు.
ప్రతిరోజూ ఉదయం 09:00 గంటలకు, తిరిగి సాయంత్రం 05:00 గంటలకు ఈ బస్సు బైంసా నుండి బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రారంభమైన ఈ సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

