Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలలను పాఠశాలకు పంపే బాధ్యత తల్లిదండ్రులదే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 9:20 PM విజయనగరంGeneral
బాలలను పాఠశాలకు పంపే బాధ్యత తల్లిదండ్రులదే - Udayam
న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో గురువారం కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామంలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు గంజి ప్రసాద్‌, కె. శ్రీధర్‌ మాట్లాడుతూ బాలల హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని సూచించారు. బాలలను పనుల్లోకి పంపకుండా పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులు, సమాజంపై ఉందన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా చట్టపరమైన నిబంధనలు పాటించాలని తెలిపారు.

Comments

G
Loading comments...