Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలామృతంలో విష గుళికలు కలిపారన్న ప్రచారంలో నిజం లేదు

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:35 PM ములుగుGeneral
బాలామృతంలో విష గుళికలు కలిపారన్న ప్రచారంలో నిజం లేదు - Udayam
దుంపల్లగూడెం-1 అంగన్‌వాడీ కేంద్రం బాలామృతంలో విష గుళికలు కలిపి గేదె మృతి చెందిందన్న ప్రచారంలో నిజం లేదని తాడ్వాయి ఐసీడీఎస్‌ సీడీపీవో ఇ.ప్రేమలత తెలిపారు. విచారణలో బాలామృతం దుర్వినియోగం కాలేదని వెల్లడైందన్నారు. గేదె తిన్నది తవుడు, అందులో కలిపిన గుళికలేనని తెలిపారు. బాలామృతాన్ని కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లిన ఆధారాలు లేవన్నారు.

Comments

G
Loading comments...