వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రజల నుంచి 63 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి అర్జీపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పౌర, కుటుంబ, ఆస్తి వివాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు .
Comments
Loading comments...

