Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు 142 ఫోన్ల అందజేత: సీపీ అంబర్ కిషోర్ ఝా

Follow Udayam on Google
S kumar Aug 25, 2026 8:51 PM పెద్దపల్లిGeneral
బాధితులకు 142 ఫోన్ల అందజేత: సీపీ అంబర్ కిషోర్ ఝా - Udayam
రామగుండం: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 142 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంగళవారం కమిషనరేట్‌లో ఫోన్లను అందజేసి మాట్లాడారు. ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహనతో, జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.

Comments

G
Loading comments...