వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాసలో శనివారం 27 మంది లబ్ధిదారులకు రూ.19.62 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

