వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామమందిరంలో విరాళాల లెక్కింపునకు సంబంధించిన భద్రతా చర్యలను ట్రస్ట్ కట్టుదిట్టం చేసింది. లెక్కింపు సిబ్బందికి జేబుల్లేని యూనిఫామ్, ప్రవేశం–నిష్క్రమణ వద్ద తనిఖీలు అమలు చేస్తోంది.
సీసీటీవీ పర్యవేక్షణను కూడా పెంచింది. ఇప్పటికే 45 రోజుల ఫుటేజీ పరిశీలనతో అక్రమాలపై దర్యాప్తు జరగగా, మరింత జూమ్ సామర్థ్యం ఉన్న PTZ కెమెరాల ఏర్పాటుతో పాటు ఫుటేజీ బ్యాకప్ వ్యవధిని 180 రోజులకు పెంచినట్లు సమాచారం.
Comments
Loading comments...

