వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల కుంభకోణం: కొత్త సిట్ ఏర్పాటు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ, అక్రమాలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. ఐజీ కిరణ్ నేతృత్వంలోని ఈ బృందంలో డీఐజీ సోమెన్ వర్మ, ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సభ్యులుగా ఉంటారు.
గత ఐదేండ్ల ట్రస్ట్ ఖాతాల ఆడిట్, ఆభరణాల నిర్వహణ, ఆర్థిక అవకతవకలపై ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. సీనియర్ అధికారులతో ఈ కేసు విచారణ వేగవంతం కానుంది.
Comments
Loading comments...