వార్తలకు తిరిగి వెళ్లండి
మత్తుకు దూరంగా.. ఉజ్వల భవిష్యత్తు వైపు

మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని కోదాడ ఎస్ఐ సుధీర్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నివారణపై కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
డ్రగ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు చట్టరీత్యా నేరమని, దీనివల్ల ఆరోగ్యం, మానసిక దృఢత్వం దెబ్బతింటాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...