వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్లో మహిళపై దాడి
రాజేష్ కుమార్ Jun 25, 2026 8:31 AM నిజామాబాద్ 9 viewsabout 21 hours ago

నిజామాబాద్లోని ఆర్య నగర్ ఎఫ్సీఐ కాలనీలో బుధవారం అర్ధరాత్రి వాష్రూమ్కు వెళ్లిన నాగమణి అనే మహిళపై దుండగుడు దాడి చేసి, ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసును దొంగిలించాడు.
బాధిత మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వెంటనే గాలించి నిందితుడిని పట్టుకున్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...