Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుఖ్‌బీర్‌ బాదల్‌పై నాందేడ్‌లో దాడి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 13, 2026 3:50 PM ఆల్ ఇండియా జాతీయ
సుఖ్‌బీర్‌ బాదల్‌పై నాందేడ్‌లో దాడి - Udayam
శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారా సమీపంలో ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆయన కుడి చేతికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో బాదల్‌ సతీమణి హర్‌సిమ్రత్‌ కౌర్‌ ఆయన వెంట ఉన్నారు. భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...