వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ సిబ్బందిపై యువకుడి దాడి

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడికి తెగబడ్డాడు. బైక్తో బస్సును అడ్డగించి, సిబ్బందితో పాటు ప్రయాణికులను అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ ఘటనతో కరకట్టపై గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దాడి చేసిన పి. కృష్ణప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...