Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 వేల వివాదంలో వ్యక్తిపై దాడి

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:28 PM విజయనగరంGeneral
రూ.30 వేల వివాదంలో వ్యక్తిపై దాడి - Udayam
విజయనగరం జిల్లాలో రూ.30 వేల డబ్బు వివాదంలో యెల్ల రాజేశ్‌ను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి రాత్రంతా నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిపై దాడి చేసి స్కూటర్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కిడ్నాప్‌, హత్యాయత్నం సహా బీఎన్‌ఎస్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...