Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోం వరదల్లో 66 మంది మృతి

కిరణ్ కుమార్ Jul 26, 2026 9:17 AM అల్ ఇండియా about 1 hour ago
అసోం వరదల్లో 66 మంది మృతి - Udayam Digital
అసోంలో వరదలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆరు జిల్లాల్లో 6.55 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందడంతో ఈ ఏడాది వరదల మృతుల సంఖ్య 66కు చేరింది. శివసాగర్‌, చరైదేవ్‌ జిల్లాల్లో తాజాగా మరణాలు నమోదయ్యాయి. చరైదేవ్‌, దిబ్రూగర్‌, గోలాఘాట్‌, జోర్హాట్‌, నాగావ్‌, శివసాగర్‌ జిల్లాలు వరద ప్రభావంతో అల్లాడుతున్నాయి.

Comments

G
Loading comments...