Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశోక్ ధామ్‌లో తొక్కిసలాట.. 7 మంది మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:49 AM ఆల్ ఇండియా జాతీయ
బీహార్‌లోని లఖిసరాయ్‌ అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగి ఏడుగురు మహిళా భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. శ్రావణ సోమవారం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన వేళ విద్యుత్‌ స్తంభం కూలిందన్న పుకారుతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...