వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ భగత్నగర్ దోపిడీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బాధితుడి అల్లుడు, మనవడు మేరఠ్ కోర్టులో లొంగిపోయారు. మరో ముగ్గురు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
డమ్మీ పిస్టళ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన ఇద్దరు నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై కరీంనగర్కు తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

