Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురు, తల్లిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
కూతురు, తల్లిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
కడపలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితుడు పెయింటర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రిమ్స్ పరిధిలోని దండోరా కాలనీలో కుమార్తె హారిక(22), సిద్ధవటం పరిధిలో తల్లి ఓబులమ్మను హత్య చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులోని అరుణాచలంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బాబును కడపకు తరలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...