వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లాలో 7 లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14న ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నట్లు సామాజిక వన విభాగం అధికారి సూర్యనారాయణ తెలిపారు.
పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కాల్వలు, చెరువులు, రహదారుల వెంట నాటేందుకు ఆయా శాఖలకు మొక్కలు అందించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

