వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆర్డీవో కృష్ణవేణి కోరారు. ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గోవిందరావుపేట, చల్వాయి, తాడ్వాయి, కాటాపూర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బీఎల్ఓలకు సూచనలు చేశారు.
సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత నమూనా-6తో ఓటరుగా నమోదు కావాలని సూచించారు.
Comments
Loading comments...

