వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం పథకంలో లబ్ధి అందని అర్హుల నుంచి జిల్లాలో 5,934 దరఖాస్తులు వచ్చాయి. గత నెల 22న 1,35,695 మంది విద్యార్థులకు రూ.13 వేల చొప్పున సాయం అందింది. వివిధ కారణాలతో 24,716 మంది లబ్ధికి దూరమయ్యారు.
విద్యుత్తు వినియోగం, వివరాల తప్పులతో పలువురు అనర్హులయ్యారు. దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 30న మిగిలిన అర్హుల జాబితా విడుదల చేసి నగదు జమ చేయనున్నారు.
Comments
Loading comments...

