వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్ దిగ్గజం యాపిల్ హైదరాబాద్లోని రాయదుర్గం టీ-హబ్ సమీపంలో దసరా నాటికి భారీ ఎక్స్పీరియెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందులో ఎక్స్పీరియెన్స్ సెంటర్తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ), సర్వీస్, కాల్ సెంటర్లు కూడా కొలువుదీరనున్నాయి.
సుమారు 3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్న యాపిల్, ఇక్కడి నుండి ఏఐ, డిజిటల్ ఆపరేషన్స్ వంటి సాంకేతిక కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇందుకోసం కొత్తగా 3,500 మందిని నియమించుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

