వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఏపీ సీఎం ఆదేశం

పొగాకు రైతు ప్రయోజనాలను కాపాడేందుకు మద్దతు ధరకు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలను ఆదేశించారు. కిలో రూ. 200 ల కంటే ధర తగ్గకుండా వేలాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
అధిక ఉత్పత్తి వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలపగా, ఇచ్చిన ఇండెంట్ల ప్రకారం కొనుగోలు చేయని కంపెనీలపై చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
Comments
Loading comments...