వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని గరుగుబిల్లిలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్షరాస్యత ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టారు.
ర్యాలీలో ఎంపీడీవో సూర్యనారాయణతో పాటు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అక్షరాస్యతతో వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారేందుకు కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

