వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ అన్నదాన పథకానికి శ్రీకాకుళానికి చెందిన కస్ప జయవర్ధన్, నిహారిక దంపతులు తమ కుమార్తె కస్ప జహిత పేరుతో రూ.1,00,116 విరాళంగా అందించారు.
బుధవారం ఆలయ అధికారులకు ఈ చెక్కును అందజేశారు. అనంతరం దంపతులకు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను పాలకమండలి సభ్యుడు అందవరపు రఘురాం, జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయి అందజేశారు.
Comments
Loading comments...

