వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రబ్బర్ల ప్యాకింగ్, వ్యాపారం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంకుశం రాజా విజయవాడ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతడికి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది.
అతడి భార్య సుష్మను పోలీసులు అరెస్టు చేసి రూ.5 లక్షలు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తునకు 11 మందితో సిట్ ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

