వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన వేడుక శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఘంటా మండపంలో మలయప్ప స్వామి, ఉభయ దేవేరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దజీయర్ సమక్షంలో పట్టువస్త్రాలు సమర్పించి, తాళపుచెవుల గుత్తిని స్వామివారి పాదాల చెంత ఉంచారు. సాయంత్రం స్వామివారు పుష్పపల్లకీపై మాడవీధుల్లో విహరించారు.
Comments
Loading comments...

