వార్తలకు తిరిగి వెళ్లండి

హోంమంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ పాలనలో బూతుల సంస్కృతి పెరిగిందని, ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన అన్నారు.
ప్రజల్లో ఉనికి చాటుకునేందుకే వైసీపీ నేతలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు దిగజారుతున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న గౌరవం అందరికీ తెలుసని, వారి పద్ధతులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

