వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో నాయిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

