Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:26 PM జాతీయంక్రీడలు
అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు - Udayam
అండర్‌-20 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు మరో మూడు పతకాలు సాధించారు. 68 కేజీల విభాగంలో మాన్సీ లాథర్ రజతం, 57 కేజీల్లో తన్వీ మగ్దుమ్, 59 కేజీల్లో కోమల్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దీంతో టోర్నీలో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం కాజల్ దోచాక్ స్వర్ణం, తనుశర్మ, సవిత రజతాలు సాధించారు.

Comments

G
Loading comments...