Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రైల్వేలైన్‌కు భూసేకరణ

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 12:52 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
అమరావతి రైల్వేలైన్‌కు భూసేకరణ - Udayam
అమరావతి-ఎర్రుపాలెం-నంబూరు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ కార్యాచరణ ప్రారంభమైంది. వీరులపాడు మండలంలోని నాలుగు గ్రామాల్లో భూసేకరణపై ఈ నెల 15, 16న తహసీల్దార్ కార్యాలయంలో సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నందిగామ ఆర్డీవో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, గూడెం మాధవరం గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...