వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ఈ-ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంతో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయం పెరిగిందని మార్కెటింగ్ శాఖ ఏడీ నరేంద్ర తెలిపారు. జులై నుంచి ఈ-పర్మిట్ అమల్లోకి వచ్చిందన్నారు. జిల్లాలోని 11 AMCల ద్వారా గత ఏడాది జులైలో పేపర్ విధానంలో రూ.68.97 లక్షల ఆదాయం వచ్చింది.
ఈ ఏడాది జులైలో ఈ-పర్మిట్ విధానంతో రూ.1.71 కోట్ల ఆదాయం సమకూరిందని మార్కెటింగ్ శాఖ ఏడీ నరేంద్ర తెలిపారు.
Comments
Loading comments...

