వార్తలకు తిరిగి వెళ్లండి
అమర్నాథ్ యాత్రకు నేటి నుంచే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ప్రసిద్ధ అమర్నాథ్ వార్షిక యాత్రకు సంబంధించి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుండి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం తొలి యాత్రికుల బృందాన్ని జెండా ఊపి ప్రారంభించనుండటంతో, కేటాయించిన కేంద్రాల వద్ద భక్తులు భారీగా క్యూ కట్టారు.
సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయ దర్శనానికి జూలై 3 నుండి 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.
Comments
Loading comments...