వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లేడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శివ కృష్ణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడంతో పాటు సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.
Comments
Loading comments...

