Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ చర్చపై అఖిలేష్ ఆగ్రహం

మనీష్ రెడ్డి Jul 22, 2026 3:27 PM అల్ ఇండియా in about 4 hours
నీట్ చర్చపై అఖిలేష్ ఆగ్రహం - Udayam Digital
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య ఏమైనా రహస్య అవగాహన కుదిరిందా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఇది పార్టీల సమస్య కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. కేవలం కొన్ని పార్టీలకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఎస్పీ ఎంపీలతో కలిసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...