వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం సింగారంలో రైతుల పొలాలను శుక్రవారం డా. ఈటెల సత్యనారాయణ, డివిజనల్ వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఏఈఓ అనిల్ సందర్శించారు. వరి, పత్తి, కంది పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఎరువుల వినియోగం, కలుపు నివారణ, చీడపీడల నియంత్రణపై రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించారు. వ్యవసాయ శాఖ రైతులకు పంటల సంరక్షణకు సూచనలు పాటించాలని తెలిపింది.
Comments
Loading comments...

