వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని నంబాలకు చెందిన శనిగారపు బాపు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. బాపు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై ఇంట్లో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.
దీంతో శుక్రవారం ఆయన బాపు కుటుంబాన్ని పరామర్శించే వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాప కుటుంబానికి పూర్తిగా నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని స్థానిక తాసిల్దార్ ను ఆయన కోరారు.
Comments
Loading comments...

