వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆదిలాబాద్లో 2017 టీఆర్టీ ఏజెన్సీ ఉపాధ్యాయ నియామకాలలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందారన్న ఫిర్యాదులపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే విచారణకు పూర్తి రికార్డులతో హాజరుకావాలని ఆదేశించింది. ఫిర్యాదుదారులు కూడా విచారణకు హాజరుకావాలని కమిషన్ సూచించింది.
Comments
Loading comments...
