వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలంలోని వలసబల్లేరు పంచాయతీ బొడ్డగాడిగూడ, చాపరాయిగూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై రాళ్లు తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ సమస్యను ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారి అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

