వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలలో ఎరువులు, పురుగు మందులను వాడే సమయంలో వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు పాటించాలని దండేపల్లి మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు వేసిన వివిధ పంటలు ఎదుగుదశలో ఉన్నాయన్నారు.
వర్షాలు, తదితర కారణాలతో పంటలకు తెగుళ్లు సోక వచ్చని, పంట ఎదుగుదలకు ఎరువులు వాడాల్సి ఉంటుందన్నారు. అధికారుల సూచనల మేరకే ఎరువులు, పురుగు మందులు వాడాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

