వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులను వేధిస్తే డీలర్లపై చర్యలు
మానస శర్మ Jun 25, 2026 1:26 PM సూర్యాపేట 18 viewsabout 16 hours ago

నాణ్యమైన విత్తనాలనే వాడాలని, ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి రైతులకు సూచించారు. కోదాడలో విత్తన మేళాలను సందర్శించి ఆయన ఈ మేరకు రైతులకు దిశానిర్దేశం చేశారు.
ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులు యూరియాను ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...